• చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై గారు మొదటిసారిగా 1838లో ముద్రించారు. ఈ గ్రంథం 1869లో ద్వితీయ ముద్రణ పొందింది. ఈ గ్రంథం 1941 లో దిగవల్లి వేంకట శివరావు గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు న్యూఢెల్లీ (New Delhi) లో తిరిగి ముద్రించారు.