రాఖీ సావంత్ రాష్ట్రీయ ఆమ్ పార్టీకి రాజీనామా చేసి 2014 జూన్ లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ)లో చేరింది. దళితుల కోసం పని చేయాలనే కోరికను వ్యక్తం చేరింది.[3][4] రాఖీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేస్తున్నది.[5]
2015 సెప్టెంబరులో, 2005 నుండి ఆడిట్ చేయబడిన బ్యాలెన్స్ షీట్లు, ఐటి రిటర్న్ డాక్యుమెంట్లను సమర్పించనందుకు మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ కోల్పోయిన 16 పార్టీలలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) ఒకటి. దీంతో వారు తమ అధికారిక ఎన్నికల చిహ్నాలను కోల్పోయారు.[6]