1918 అక్టోబరు 15 నాడు ఊటుకూరి వెంకట శ్రేష్టి స్థాపించిన ఈ గ్రంథాలయమునకు గాంధేయుడు గోరంట్ల వెంకన్న మొదటి దశలో భూరి విరాళము ఇచ్చాడు. దీని కొత్త భవనానికి 1929 లో మహాత్మా గాంధీ శంకుస్థాపన చేశాడు. 1935 లో బాబూ రాజేంద్ర ప్రసాద్ దీన్ని సందర్శించాడు. దీని భవనాలను సేఠ్ జమ్నాలాల్ బజాజ్, టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు. ఈ గ్రంథాలయములో పాత పుస్తకాలు, వార్తా పత్రికలు, మేగజిన్లు, పత్రికల విస్తారమైన సేకరణ ఉంది. కొన్ని వార్తాపత్రికలు 1909 వ సంవత్సరమునుండి ఉన్నాయి. 70,000కు పైగా సేకరణలు ఉన్న ఈ గ్రంథాలయములో చాలా మటుకు సేకరణలు అరుదైనవి. దేశము నలుమూలల నుండి, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మొదలైన విదేశాలనుండి పలువురు పరిశోధకులు తమ పరిశోధనా ప్రాజెక్టుల కొరకు ఇక్కడ బసచేసి గ్రంథాలయ వనరులను ఉపయోగించుకొన్నారు.
గ్రంథాలయం అభివృద్ధిలో కొన్ని ముఖ్య ఘట్టాలు
1918 అక్టోబరు 15 నాడు ఊ.వెం. శ్రేష్ఠి F.A.R.U., హిందూ యువజన సంఘం గ్రంథాలయాన్ని స్థాపించాడు
1924 ఒక పెంకుటిల్లును స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రంథాలయాన్ని తరువాత 'సారస్వత నికేతనం' అని నామకరణం చేశారు. ఈ భవనాన్ని జమ్నాలాల్ బజాజ్ చే ప్రారంభించబడింది.
1927 లో ఈ గ్రంథాలయం, 1927 సొసైటీ చట్టం క్రింద రిజిస్టరు కాబడింది.
1929 క్రొత్త భవంతికి శంకుస్థాపన, మహాత్మా గాంధీ, చేసాడు. తరువాత ఈ భవంతిని ప్రకాశం పంతులు ప్రారంభించాడు.
1930 ఈ గ్రంథాలయం, జిల్లా కేంద్ర గ్రంథాలయంగా గుర్తింపు పొందినది.
1950 జర్నలిజం కొరకు తరగతులు, వావిలాల గోపాలకృష్ణ ప్రధానాచార్యులుగా వ్యవహరించి, జరిపించారు.
1985 RRLF, కలకత్తా వారిచే ఇవ్వబడిన మ్యాచింగ్-గ్రాంటు సహాయంతో, క్రొత్త వింగ్ ను ఏర్పాటు గావించారు.
2018 వందేళ్ల పండుగ సందర్భంగా గ్రంథాలయ భవనం చిత్రంలో పోస్టల్ కవర్ విడుదల.[2]
భౌగోళికము
చీరాల నుండి 8 కి.మీ దూరంలో వేటపాలెంలో వున్నది. (OSM పటం చూడండి)
సారస్వత నికేతనం
అపురూపమైన పుస్తకాలు
సారస్వత నికేతనంలో ఎన్నో అపురూపమైన, అత్యంత అరుదైన పుస్తకాలు ఉండటం వలన తెలుగు సాహిత్య చరిత్రలో, చరిత్రరచనకు ఉపయోగం. తెలుగులో తొలి యాత్రాచరిత్రగా పేరొందిన ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రచరిత్ర గ్రంథాన్ని 1940 ప్రాంతాల్లో మూడవసంకలనం కూర్పుచేసి పునర్ముద్రించేందుకు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, పుస్తకప్రియుడు దిగవల్లి వేంకటశివరావు ప్రయత్నించగా వేటపాలెం గ్రంథాలయంలోనే మంచి ప్రతి దొరికి పునర్ముద్రణ సాధ్యమైంది.[3]
చిత్రమాలిక
1935లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ సందర్శన సందర్భంగా ప్రతిష్టించిన స్తూపం