భారత దేశంలో ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాప్రభుత్వాన్ని సస్పెండు చేసి లేదా రద్దుచేసి, రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకురావడాన్ని రాష్ట్రపతి పాలన అంటారు. భారత రాజ్యాంగం లోని 356 వ అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం సంక్రమించింది. దీని ప్రకారం, రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని భావించినపుడు, దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. రాష్ట్రంలోని పరిస్థితిపై గవర్నరు ఇచ్చిన నివేదికపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రపతి పాలన అమల్లో ఉండగా, రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్ర గవర్నరు పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ బాధ్యతల్లో భాగంగా గవర్నరు తనకు సహాయపడేందుకు అధికారులను నియమించుకోవచ్చు.
మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం ద్వారా పరిపాలన సాగిస్తుంది. ఈ మంత్రులు శాసనసభకు జవాబుదారీగా ఉంటారు. మంత్రులకు ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తాడు. గవర్నరు రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి మాత్రమే. వాస్తవానికి ముఖ్యమంత్రే రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వహణాధికారి. అయితే, రాష్ట్రపతి పాలనలో ఉండగా, మంత్రివర్గాన్ని రద్దు చేస్తారు. ముఖ్యమంత్రి ఉండరు. శాసనసభ సమావేశాలను వాయిదా (ప్రోరోగ్) వేస్తారు లేదా రద్దు చేస్తారు. రద్దు చేస్తే కొత్త ఎన్నికలు అనివార్యమౌతాయి.
జమ్మూ కాశ్మీరులో గవర్నరు పాలన అనే పద్ధ్తి కూడా ఉంది. అక్కడి ప్రభుత్వం విఫలమైనపుడు, జమ్మూ కాశ్మీరు రాజ్యాంగం లోని 92 వ విభాగం కింద గవర్నరు పాలన విధిస్తారు. రాష్ట్రపతి అనుమతితో గవర్నరు ఈ పాలన విధిస్తారు. ఆరు నెలల తరువాత కూడా గవర్నరు పాలనను ఎత్తివేసే వీలు కుదరకపోతే, అపుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. రాష్ట్రపతి పాలనకు, గవర్నరు పాలనకూ పెద్ద తేడా లేదు.
1994 లో ఎస్సార్ బొమ్మై కేసులో ఇచ్చిన తీర్పులో సుప్రీమ్ కోర్టు, ఇచ్ఛవచ్చిన రీతిలో రాష్ట్రపతి పాలన విధింపుకు అడ్డుకట్ట వేసింది. ఛత్తీస్గఢ్, తెలంగాణా రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పటివరకూ ఒక్కసారి కూడా రాష్ట్రపతి పాలన విధించలేదు.
Note:-ఆంధ్ర ప్రదేశ్ లో మొదటిసారి 1973 జనవరి 18 నుంచి 1973 డిసెంబరు 10 వరకు రాష్ట్రపతి పాలన విధించారు.
రాష్ట్రపతి పాలన విధించినపుడు రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు లేదా తాత్కలికంగా సుప్త చేతన స్థితిలో ఉంచవచ్చు.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శాసనసభలో తగినంత ఆధిక్యత ఏ పార్టీకి గాని, కూటమికి గాని లేకపోయినపుడు కూడా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ సమావేశాల ముగింపుకు, తదుపరి సమావేశాల మొదలుకూ మధ్య 6 నెలలకు మించి అంతరం ఉండరాదు.
రాష్ట్రపతి పాలన 6 నెలలకు మించి విధించరాదు. అయితే 6 నెలల వ్యవధి తరువాత మరో 6 నెలల కాలానికి పొడిగించవచ్చు. ఈ విధంగా ఎన్నిసార్లైనా పొడిగించవచ్చు.
రాష్ట్రపతి పాలనలో రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన ఏ అధికారాన్ని రద్దు చేసే అధికారం మాత్రం రాష్ట్రపతికి లేదు.
రాష్ట్రపతి పాలన విధింపును పార్లమెంటు నిర్ధారించాలి.
విమర్శ
ఏదైనా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తినపుడు, పౌర ఆందోళనలు జరిగినపుడు రాష్ట్రప్రభుత్వం అదుపు చెయ్యలేకపోతే, దేశ ఐక్యతను, సమగ్రతనూ కాపాడేందుకు 356 అధికరణం కేంద్ర ప్రభుత్వానికి అనేక అధికారాల నిచ్చింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న వివిధ పార్టీలు తరచూ ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వచ్చాయి.[1] ఈ అధికారాలను ఉపయోగించి, తమ ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను తొలగించాయి.[2] అందుచేత దీన్ని సమాఖ్య వ్యవస్థకు ముప్పుగా అనేకులు పరిగణించారు. 1950 లో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాక, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసేందుకు కేంద్రం ఈ అధికరణాన్ని అనేక మార్లు ఉపయోగించింది.[3]
1954 లో ఉత్తర ప్రదేశ్లో మొదటిసారిగా ఈ అధికరణాన్ని ప్రయోగించారు. 1970, 1980 లలో, దీన్ని ఉపయోగించడం మామూలై పోయింది.[4] ఇందిరా గాంధీ ప్రభుత్వం, జనతా పార్టీ ప్రభుత్వం ఇందుకు బాధ్యులు. 1966, 1977 మధ్య ఇందిరా గాంధీ 39 సార్లు ఈ అధికరణాన్ని ప్రయోగించగా, జనతా పార్టీ తన రెండున్నరేళ్ళ పాలనలో 9 సార్లు ప్రయోగించింది.
ఎస్సార్ బొమ్మై కేసులో సుప్రీమ్ కోర్టు 1994 లో ఇచ్చిన తీర్పులో రాష్ట్రపతి పాలన విధింపుపై నియంత్రణలు విధించిన తర్వాత మాత్రమే ఇది తగ్గింది. 2000 తర్వాత రాష్ట్రపతి పాలన విధింపు బాగా తగ్గిపోయింది. భారత సమాఖ్య వ్యవస్థపై జరిగే చర్చలో 356 అధికరణం ఎప్పుడూ ఒక ముఖ్య అంశమే.[5] కేంద్ర రాష్ట్ర సంబంధాలపై 1983 లో సర్కారియా కమిషను ఇచ్చిన నివేదికలో 356 అధికరణాన్ని "తక్కువగా, అత్యంత తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే, రాజ్యంగ వ్యవస్థలను పునస్థాపించేందుకు అవసరమైన అన్ని వికల్పాలనూ ప్రయత్నించాక, చిట్టచివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ప్రయోగించాల"ని పేర్కొంది.[6]
రాష్ట్రపతి పాలన విధింపుల జాబితా
వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు విధించారో కింది పట్టికలో చూడవచ్చు.
రాష్ట్రాన్ని రెండు విభజించాలన్న కేంద్ర నిర్ణయంతో విభేదించిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఎమ్మ్ల్యేలు రాజీనామా చేసారు.[7] తెలంగాణ నుండి రాష్త్రపతి పలనను 2014 జూన్ 2 న ఎత్తివేసారు. ఆంధ్ర ప్రదేశ్ లో జూన్ 8 న ఎత్తివేసారు.[8] విధించిన రెండు నెలల్లోపు పార్లమెంటు సమ్మతి తీసుకోకుండా రాష్త్రపతి పాలన కొనసాగించి, చట్టాన్ని అతిక్రమించారు.[9][10]
కేంద్రంలో జనతాపార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో జరిగిన పార్టీ మార్పిళ్ళ కారణంగా ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది.
5
అరుణాచల్ ప్రదేశ్ [2]
2016 జనవరి 25
2016 ఫిబ్రవరి 19
26 days
21 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు 11 మంది భాజపా ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులతో చేయి కలపడంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.[11] కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. దీన్ని అధికార దుర్వినియోగంగా భావించిన సుప్రీమ్ కోర్టు, కాంగ్రెసు ప్రభుత్వాన్ని పునస్థాపించింది. గవర్నరు శసనవ్యవస్థలోను, శాసనసభ స్పీకరు కార్యకలాపాల్లోనీ జోక్యం చేసుకున్నారని కోర్టు ఈ చారిత్రాత్మక తీర్పులో తప్పు పట్టింది.[12]
విదేశీయులు చట్టవిరుద్ధంగా అస్సాంలో ఉంటున్నారని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమం యునైటెద్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం చేతుల్లో హింసాత్మకంగా మారడంతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి.
7
అస్సాం [2]
1981 జూన్ 30
1982 జనవరి 13
197 రోజులు
చట్తవిరుద్ధంగా రాష్ట్రంలో ఉంటున్న విదేశీయులకు వ్యతిరేకంగా జరిగిన అస్సాం ఉద్యమం కారణంగా వలస వచ్చిన మైనారిటీలకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ (ఐ) కు చెందిన అన్వరా తైమూర్ ప్రభుత్వం పడిపోయింది.
8
అస్సాం [3]
1982 మార్చి 19
1983 ఫిబ్రవరి 27
345 రోజులు
అస్సాం ఉద్యమం కారణంగా కాంగ్రెస్ (ఐ) కు చెందిన కేశబ్ గోగోయి ప్రభుత్వం పడిపోయింది.
9
అస్సాం [4]
1990 నవంబరు 28
1991 జూన్ 30
214 రోజులు
అసోం గణపరిషత్ కు చెందిన ప్రఫుల్ల మహంత ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ కేంద్రం ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఉల్ఫా కార్యకలాపాల కారణంగా జాతీయ సమగ్రతలు భంగం కలుగుతోందని కేంద్రం ఈ చర్య తీసుకుంది. రాష్ట్రపతి పాలనలో ఉండగా ఉల్ఫా తీవ్రవాదులను ఏరివేసేందుకు కేంద్రం ఆపరేషన్ బజరంగ్ ను జరిపింది
కాంగ్రెసు పార్టీలో విభజనతో జరిగిన పార్టీ మార్పిళ్ళ కారణంగా ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది..
12
బీహార్ [3]
1972 జనవరి 9
1972 మార్చి 19
70 రోజులు
పార్టీ మార్పిళ్ళ కారణంగా ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది..
13
బీహార్ [4]
1977 ఏప్రిల్ 30
1977 జూన్ 24
55 రోజులు
జగన్నాథ్ మిశ్రా ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ, ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసింది.
14
బీహార్ [5]
1980 ఫిబ్రవరి 17
1980 జూన్ 8
112 రోజులు
రాం సుందర్ దాస్ ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ, ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసింది.
15
బీహార్ [6]
1995 మార్చి 28
1995 ఏప్రిల్ 5
8 రోజులు
శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చే లోగా రాష్ట్ర తాత్కాలిక బడ్జెట్టును పార్లమెంటులో పాస్ చేసేందుకు గాను, కేంద్రం వారం రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించింది.
16
బీహార్ [7]
1999 ఫిబ్రవరి 12
1999 మార్చి 9
25 రోజులు
నారాయణపూర్లో 11 మంది దళితుల హత్యతో శాంతి భద్రతలు క్షీణించాయి. వాజపేయి ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేనందున 26 రోజుల్లోనే రాష్ట్రపతి పాలనను ఎత్తేసింది.
17
బీహార్ [8]
2005 మార్చి 7
2005 నవంబరు 24
262 రోజులు
ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ ఎవరికీ రాలేదు. అందుచేత కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. చారిత్రాత్మకమైన తీర్పులో సుప్రీమ్ కోర్టు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శాసనసభకు అవ్వకాశం ఇవ్వకుండా రాష్ట్రపతి పాలన పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని, దురాలోచనతో కూడిన చర్య అనీ వ్యాఖ్యానించింది.[13]
18
ఢిల్లీ [1]
2014 ఫిబ్రవరి 14
2015 ఫిబ్రవరి 11
362 రోజులు
జన లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టలేక పోయినందుకు గాను, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ రాజీనామా చేసాడు.