ఇతడు దివాకర్ల వంశంలో పరీధావి నామ సంవత్సరం, ఆషాఢ పౌర్ణమి నాడు ఆకుతీగపాడు గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో జన్మించాడు. జన్మనక్షత్రం మూల. హరితస గోత్రుడు. వెలనాటి వైదిక బ్రాహ్మణుడు. కృష్ణ యజుర్వేదశాఖకు చెందినవాడు. ఇతని తండ్రి పేరు సుందరరామయ్య, తల్లి పేరు వేంకమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం యండగండి ఇతని స్వగ్రామం. తిరుపతి వేంకటకవులలో ఒకరైన దివాకర్ల తిరుపతిశాస్త్రి ఇతనికి పినతండ్రి. దివాకర్ల వేంకటావధానికి ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్లు. ఇతడే ఇంటికి పెద్దకొడుకు. బాల్యంలోనే ఇతని ప్రతిభాపాటవాలు వెలుగు చూశాయి. సహజ ధారణాశక్తితో చిన్నప్పుడే తిరుపతి వేంకటకవుల అవధాన పద్యాలను కంఠస్తం చేశాడు. ఎనిమిదవ తరగతి చదివే సమయంలోనే ఇతని పద్యాలు భారతి మాసపత్రికలో ప్రచురితమయ్యాయి.
ఇతడు తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు ఇతనికి మహాలక్ష్మితో వివాహం జరిగింది. అప్పుడు మహాలక్ష్మి వయసు ఎనిమిదేళ్లు మాత్రమే. పెళ్ళి జరిగిన మూడు సంవత్సరాలకే మహాలక్ష్మి విషజ్వరంతో మరణించింది. తరువాత ఇతడు బి.ఏ (ఆనర్సు) రెండవ సంవత్సరంలో ఉండగా చంద్రావతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కలిగారు.
ఇతడు నలభైకి మించి గ్రంథాలను రచించాడు. వాటిలో పద్యకృతులు, వచన రచనలు, విమర్శలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు, టీకాతాత్పర్యాలు ఉన్నాయి. ఖండవల్లి లక్ష్మీరంజనంతో కలిసి ఆంధ్రమహాభారత సంశోధిత ముద్రణకు విపులమైన పీఠిక వ్రాశాడు. తెలంగాణాలోని మారుమూల గ్రామాలకు పిలవగానే వెళ్లి ఉపన్యాసాల ద్వారా అక్కడి ప్రజలకు తెలుగు భాషాసాహిత్య చైతన్యాన్ని కలిగించాడు. అనేక కవిపండితుల గ్రంథాలకు చక్కని పీఠికలను, సమగ్ర సమీక్షలను అందించి వారిని ప్రోత్సహించాడు. ఇతనికి అనేక సాహిత్య సంస్థలతో సంబంధం ఉండేది. వాటిలో ఆంధ్ర సారస్వత పరిషత్తు, యువభారతి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ, సంస్కృత భాషా ప్రచార సమితి, ఆర్ష విజ్ఞాన సమితి, సురభారతి, కళాస్రవంతి అనేవి కొన్ని. ఇతడి ఉపన్యాసాలకు జనం వేలకొలది వచ్చేవారు. వసుచరితము గురించి ఇతడు ఉపన్యసిస్తుంటే శ్రోతలు వర్షంలో గొడుగులు పట్టుకుని నిలబడి ఉపన్యాసం విన్నారంటే ఇతని ఉపన్యాస కళ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ విశిష్ట సభ్యుల ప్రశంస
తిరుపతివేంకటకవులు
పరశురామ పంతుల జీవితము - సాహిత్యము
పోతన
POTHANA
వాల్మీకి-విశ్వనాథ
ఆదికవి వాల్మీకి
ఆంధ్రవాజ్మయారంభ దశ - ప్రబంధవాజ్మయము
మలయాళ వాఙ్మయ చరిత్ర
సాహిత్యసోపానములు
భాషాశాస్త్ర విమర్శసూత్రములు
కవిసమ్రాట్ విశ్వనాథ
అల్లావుద్దీను వింతలాంతరు
కృష్ణయజుర్వేదీయ తైత్తరీయ సంహిత
వ్యాసావళి
సంస్కృత వ్యాకరణ సంగ్రహము
విశాలాంధ్రోదాహరణము
భారతస్వాతంత్ర్యోదాహరణము
సుందర సందేశము - గేయ సుందరకాండము
భగవద్గీత యథాతథము
శివానందలహరి (టీకా తాత్పర్యములు)
సౌందర్యలహరి (టీకా తాత్పర్యములు)
అవధానములు
ఇతడు సుమారు 15 అవధానములు చేశాడు. ఇతడు విద్యార్థిగా ఉన్నపుడు బందరు హిందూ కళాశాలలో మొదటి అవధానం చేశాడు. తరువాత ఉండి, మొదటి ప్రపంచతెలుగు మహాసభలలో (హైదరాబాదు), ఆకాశవాణిలో, విద్యుత్సౌధ (హైదరాబాదు) లో, కాకినాడ తదితర ప్రాంతాలలో అవధానాలు నిర్వహించాడు.[11]
ఇతడి అవధానాలలో మచ్చుకు రెండు పూరణలు ఇలా ఉన్నాయి.
సమస్య: ముండను భక్తిభావమున పూజ యొనర్చెను మోక్షసిద్ధికై
ఇతడు 1986లో భారతీయ విద్యాభవన్ ముంబై వారి చండీయాగానికి వెళ్లాడు. అక్కడ అతనికి జైన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఆ సందర్భంలో ఇతడికి అధిక రక్తస్రావము జరిగి 1986, అక్టోబరు 21 తేదీన మరణించాడు.
మూలాలు
↑తిరుమల, శ్రీనివాసాచార్య (2012). దివాకరప్రభ (1 ed.). హైదరాబాదు: యువభారతి. p. 17-16.
↑దివాకర్ల, వేంకటావధాని (1958). ఆంధ్ర వాజ్మయ చరిత్రము (2 ed.). హైదరాబాదు: ఆంధ్ర సారస్వత పరిషత్తు.
↑దివాకర్ల, వేంకటావధాని (1958). ఆంధ్ర వాజ్మయ చరిత్రము. హైదరాబాదు: ఆంధ్ర సారస్వత పరిషత్తు.
↑దివాకర్ల, వేంకటావధాని (1976). TELUGU IN THIRTY 30 DAYS (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ.