జె.బాపురెడ్డి, (1936, జూలై 21 - 2023, ఫిబ్రవరి 8) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి, కవి, రచయిత. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చేరి మెదక్, వరంగల్లు జిల్లాలకు కలెక్టర్గా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రత్యేక సహాయకుడుగా ఉన్నాడు. భారత పొగాకు బోర్డుకు ఎక్జిక్యూటివ్ డైరెక్టర్గా, ధర్మాదాయశాఖకు కమీషనర్గా, పరిశ్రమల శాఖ కమీషనర్గా, చిన్నమొత్తాల పొదుపు సంస్థ కమీషనర్గా, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఇతడు 37 దేశాలలో పర్యటించి పలు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకున్నాడు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో 38కి పైగా గ్రంథాలను వెలువరించాడు.[1]
మహాకవి సి. నారాయణ రెడ్డి స్పూర్తితో 8వ తరగతిలలోనే కవిత్వం రాసి సాహిత్యరంగంలోకి అడుగుపెట్టిన బాపురెడ్డి పద్యం, గేయం, వచనం, విమర్శ, అనువాదం మొదలు అన్ని సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేశాడు.
సామాజిక, సాహిత్య, సాంస్కృతిక సంఘాలతో అనుబంధం
ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ - ప్రత్యేక అధికారి
అఖిల భారత సాంస్కృతికోత్సవాలు - కార్యదర్శి
మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు - కార్యదర్శి
నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు - హైపవర్ కమిటీ సభ్యుడు
అంతర్జాతీయ తెలుగు సంస్థ - బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడు
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ - సభ్యుడు
హైదరాబాద్ పొయెట్రీ సొసైటీ - అధ్యక్షుడు
జవహర్ పుస్తకాలయ సలహా సంఘం - సభ్యుడు
నేషనల్ బుక్ ట్రస్ట్ - సభ్యుడు
చైతన్య కవితావేదిక, బెంగుళూరు - ఉపాధ్యక్షుడు
సమైక్యభారతి సాహిత్య, సాంస్కృతిక సంస్థ - గౌరవ అధ్యక్షుడు
అమెరికన్ బయోగ్రాఫిక్ ఇన్స్టిట్యూట్ - గౌరవ సభ్యుడు
మైకేల్ మధుసూదన్ అకాడెమీ, కలకత్తా - గౌరవ అధ్యక్షుడు