గోండి భాష : దక్షిణ మధ్యభరత దేశంలో గోండులు మాట్లాడే భాష తెలంగాణ లో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాల్లో మాట్లాడబడుతుంది. గోండి భాష ద్రవిడ భాషా కుటుంబానికి చెందినది , తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండి భాష నుండే తెలుగు భాష పుట్టింది అని భాషావేత్తలు నిర్ధారించారు, గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే కొలాములు తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు. ప్రధాన్ , తోటి, మురియా,ఓజా వంటి ఇతర గిరిజన జాతులకు కూడా ఇదే మాతృభాష. గోండి భాషా కేవలం భారతదేశంలోనే కాకుండా ఆస్్ట్రేలియా లో కూడా మాట్లాడబడుతుంది.
అదిలాబాద్ జిల్లా మావల మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన తొడసం కైలాష్ ఆను ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల(ఇంద్రవెల్లి మండలం, గౌరా పూర్ గ్రామం)లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గిరిజనుల అభివృద్ధి కొరకు గోండు భాష లోకి తెలుగు లిపిలో పుస్తకాలు రాశాడు.
పండోక్న మహా భారత్ కథ: 18 పర్వాలు, 272 పేజీలు. రామకృష్ణ మఠం వారు 5 సంపుటాలలో వెలువరించిన బాలల మహా భారతాన్ని గోండు భాష లోకి అనువదించారు. మహాభారతాన్ని గిరిజనులకు చేరువ చేయడానికి ఈ ప్రయత్నం చేశారు.
సద్ విచార్: పిల్లలు, యువతలో మంచి ఆలోచనలు కలిగించడానికి రాశారు.[1]